కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్
ప్రజాస్వరం, మేడ్చల్: :
మేడ్చల్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారరు. మేడ్చల్ పట్టణం లోని 18 వ వార్డు రథం శాల వద్ద మాజీ కౌన్సిలర్ ,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ్ భోజ్ కార్యక్రమంలో పాల్గొని మహిళలతో కలిసి సంహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ , మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్,, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ , మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ దీపిక నరసింహారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ కురుమ,మాజి కౌన్సిలర్ కౌడే మహేష్,చేప రాజు,ఎల్లంపేట్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు అరీఫ్, ముత్యాలు గౌడ్, లతో పాటు నాయకులు రామస్వామి,పానుగంటి మహేష్,మహిళ అధ్యక్షురాలు లత లతో పాటు, కార్యకర్తలు మరియు మహిళా నాయకురాల్లు పాల్గొన్నారు.


