ఆలస్యంగా రుతుపవనాలు....

ఆలస్యంగా రుతుపవనాలు....

ప్రజాస్వరం : హైదరాబాద్ : జూన్ 04 :

 

దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది. నైరుతి రుతుపవన కాలం.జూన్ 1వ తేదీ వచ్చింది అంటే చాలు, కేరళ తీరాన్ని వర్షాలు పలకరిస్తాయి. తద్వారా దేశవ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపందుకుంటాయని అందరూ ఆశిస్తారు. అయితే 2026 సీజన్‌లో నైరుతి రుతుపవనాల రాక కోసం కొంత జాప్యం చోటు చేసుకుంది. ముందుగా అంచనా వేసినట్టుగా జూన్ 1న ఇవి కేరళను తాకలేకపోయాయి. వాతావరణ పరిస్థితుల అనుకూలించకపోవడంతో ఇవి ప్రస్తుతం ఉన్నచోటే స్తబ్ధుగా నిలిచిపోయాయి. సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకాల్సిన రుతుపవనాలు, ఈ సారి ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమయ్యాయి. ప్రస్తుతం ఇవి మార్గమధ్యలో నిలిచిపోయాయని భారత్ వాతావరణ శాఖ, ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ ధ్రువీకరించాయి. రుతుపవనాల ద్రోణి కదలికలు మందగించడమే దీనికి ప్రధాన కారణం. పూర్తిగా వ్యవసాయిక దేశం అయిన భారత్ లో వర్షాలే ఆధారం. ఎంతలా అంటే దేశ జీడీపీని ప్రభావితం చేసేటంతలా. గ్రామీణ ప్రాంతాలు దేశంలో నూటికి డెబ్బై శాతం ఉన్నాయి. దాంతో దేశ జాతీయ స్థూల ఆదాయం వృద్ధి చెందాలీ అంటే గ్రామీణ భారతం పచ్చగా ఉండాలి. అది ఎపుడు సాధ్యపడుతుంది అంటే భారీగా సమాయనుకూలంగా వానలు పడి పంటలు పండినపుడు. దేశంలో ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1న మొదలవుతుంది. కానీ దేశంలో అగ్రికల్చర్ ఇయర్ మాత్రం జూన్ లో స్టార్ట్ అవుతుంది. దానికి కారణం నైరుతు రుతు పవనాల రాక. ఈ రుతు పవనాలు ఎంత తొందరగా వస్తే అంత సంబరంగా ఏరువాక స్టార్ట్ అవుతుంది. దాంతో రైతాంగం సైతం సంబరాలు చేసుకుంటుంది. కానీ ఈసారి పరిస్థితి చూస్తే నైరుతి నై నై అంటోంది: సకాలంలో నైరుతి రుతు పవనాలు దేశంలోకి ప్రవేశించడం అంటే మే నెలాఖరు అన్న మాట. ఈ మేరకు భారత వాతావరణ విభాగం ఐఎండీ అయితే మొదట చెప్పింది మే 26న నైరుతి దేశంలో ఎంట్రీ ఇస్తుందని. కానీ ఆ డేట్ తప్పింది. ఆ తరువాత మే 30, 31 తేదీలు అన్నా కూడా అదీ జరగలేదు. జూన్ 1 లేదా 3 అని చెప్పినా ఇపుడు ఆ డేటూ మారింది. లేటెస్ట్ డేట్ ఏంటి అంటే జూన్ 8 తరువాత అని అంటున్నారు. అయితే అది కూడా అంత కన్ ఫర్మ్ అవునా కాదా అన్నది ఒక పెద్ద డౌట్. మరో వైపు చూస్తే ఈసారి నైరుతి ఆగమనం లేట్ అయినా వానలు కూడా చాలా తక్కువ పడతాయని దానికి కారణం నైరుతి బలహీనంగా ఉందని. ఈ వార్తలు అయితే రైతాంగాన్ని కాదు దేశ ఆర్ధిక నిపుణులను కూడా షాక్ కి గురి చేస్తున్నాయి. ఈసారి వానలు తక్కువ పడితే ఆ ప్రతికూల పరిస్థితి ఎలా ఉంటుంది అనే అంతా ఆలోచిస్తున్నారు. ఈసారి తేలిక పాటి వానలే పడతాయంటే వ్యవసాయం సంగతి ఏమిటి అన్నది కూడా మరో చింతగా మారుతోంది. భారత్ లో నైరుతి ఎంట్రీకి గేట్ వే కేరళం రాష్ట్రం. అక్కడ నుంచే మెల్లగా దేశంలోకి ప్రవేశించి మొత్తం దేశమంతా కొద్ది కాలంలోనే సర్దుకుని భారీ వానలు కురుస్తాయి. అలా వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయి సెప్టెంబర్ నెలాఖరు వరకూ కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం కేరళంలో కొన్ని ప్రంతాలలో వర్షాలు పడుతున్నాయి కానీ నైరుతి ఆరంభ సూచిన అది కాదని ఐఎండీ చెబుతోంది. నైరుతి రాకను గుర్తించాలంటే కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. కేరళంలోని ఈ సీజన్ లో ఏకంగా అరవై శాతం పైగా వానలు పడితే నైరుతి ఎంటర్ అయినట్లుగా భావిస్తారు. అలాగే అరేబియా సముద్రం నుంచి పశ్చిమ దిశగా వీచే గాలులు ఆ నిర్దిష్ట వేగాన్ని అందుకోవాల్సి ఉంటుంది. ఆ మీదట ఆయా ప్రాంతమంతా తగినన్ని మేఘాలు విస్తరించి ఉండాలి. ఇవన్నీ నైరుతి రుతు పవనాల ఆగమాన్ని సూచిస్తాయి. ప్రస్తుతం అయితే కేరళం రాష్ట్రంలో కొన్ని చోట్ల వానలు పడుతున్నాయి. మేఘాలు విస్తరించి కూడా ఉన్నాయి. కానీ అసలైన ప్రమాణం అయిన అరేబియా సముద్రం నుంచి గాలులు వీయడం లేదని ఐఎండీ సైంటిస్టూ చెబుతున్నారు . ఈ మూడు ఒకేసారి కలసి ఉంటేనే నైరుతి పవనాల సీజన్ స్టార్ట్ అయినట్లు. అపుడు వర్షాకాలం వచ్చినట్లుగా చెబుతారు. ఇక ఈసారి పూర్తి స్థాయి వానలు కురిసే అవకాశాలు కూడా తక్కువ అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దానికి ఎల్ నినో ప్రభావం కారణం అని స్పష్టం చేస్తున్నారు. దాని వల్ల గత ఏడాది కంటే ఈసారి తక్కువ వానలు పడతాయని వాటితోనే సర్దుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. నైరుతి రుతు పవనాలు ఆలస్యమైనా లేదా ఎంట్రీ ఇచ్చినా బలహీనం కావడం వెనక ఎల్ నినో ప్రభావం గట్టిగా ఉంటుందని అంటున్నారు. ఈ విధంగా వర్షాభావ పరిస్థితులు కనుక ఉంటే ఇది దేశ ఆర్ధిక వ్యవస్థ మీద కూడా పెను ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.ఈ జాప్యాన్ని ప్రధాన కారణం ఏంటంటే... అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన పరిస్థితులే. ఈ రెండు కూడా రుతుపవనాల పురోగతికి ఆటంకం కలిగిస్తున్నాయి. పశ్చిమ దిశ నుంచి వీచే గాలులు రుతుపవనాలను కేరళ తీరం వైపు నెట్టడంలో సహయపడాలి కానీ ప్రస్తుతం గాలి దిశ, వేగం ఇందుకు అనుకూలంగా లేవు. అయితే ఈ ఆలస్యానికి రాబోయే ఎల్‌నినో ప్రభావానికి ఎలాంటి సంబంధం లేదని స్కైమెట్‌‌ వాతావరణ, వాతావరణ మార్పుల విభాగంలో వైఎస్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ స్పష్టం చేశారు. రుతుపవనాలు కేవలం భారత్‌ పరిసరాల్లోని వాతావరణ వ్యవస్థలపైనే ఆధారపడి కేవలం భారత్ పరిసరాల్లోని వాతావరణ వ్యవస్థపైనే ఆధారపడి ఉంటాయని ఆయన వివరించారు. కేరళలోని రుతుపవనాలు ప్రవేశించాయని చెప్పడానికి కొన్ని కచ్చితమైన నియమాలు ఉన్నాయి. అవి పూర్తి అయితేనే అధికారికంగా రుతుపవనాల రాకను ప్రకటిస్తారు. కేరళ, కర్ణాటక, లక్ష్యద్వీప్‌లోని సుమారు 60 శాతం వాతావరణ కేంద్రాల్లో వరుసగా రెండు రోజులపాటు కనీసం 2.5 మి.మి. వర్షపాతం నమోదు కావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిమితి ఇంకా నెరవేరలేదు. అందుకే అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతానికి రుతుపవనాలు ఆగిపోయినప్పటికీ , ఆశాజనకమైన వార్త కూడా ఉంది. స్కైమెట్‌ అంచనాల ప్రకారం రాబోయే గురువారం లేదా శుక్రవారం నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. వచ్చే 3-4 రోజుల్లో అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, బంగళాఖాతంలోని మెజారిటీ ప్రాంతాలు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు ఇవి విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. పరిస్థితిని సమీక్షిస్తున్న ఐఎండీ త్వరలోనే రుతుపవనాల రాకపై సవరించిన తేదీని ప్రకటించే అవకాశం ఉంది. భారత్‌లో రుతుపవనాలకు కేరళ ప్రవేశ ద్వార లాంటిది. ఇక్కడికి రుతుపవనాలు చేరిన తర్వాతే దేశవ్యాప్తంగా వర్షాలు విస్తరిస్తాయి. వర్షాలపైనే దేశంలోని సుమారు 70 శాతం సాగు భూమి ఆధారపడి ఉంది. రుతుపవనాలు ఆలస్యమైతే విత్తనాలు వేయడం ఆలస్యమవుతుంది. అది ఆహార ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని రోజుల జాప్యం సర్వసాధారణమేనని, రుతుపవనాలు పుంజుకుంటే ఆ తర్వాత వర్షపాతం సాధారణంగానే ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.