ప్రతి విద్యార్థి లక్ష్యంతో చదవాలి
By Prajaswaram
On
మిరు దొడ్డి నవంబర్ 14 (ప్రజాస్వరం)
ప్రతి విద్యార్థి లక్ష్యంతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని మిరుదొడ్డి మాజీ వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు క్రీడా, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తన సొంత డబ్బులతో బహుమతులు అందజేయడం సంతోషంగా ఉందని పోలీస్ రాజులు, మాజీ ఉప సర్పంచ్ దిలీప్ రెడ్డి అన్నారు. అనంతరం పాఠశాలలో విద్యార్థుల చేసిన డాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి.
Latest News
23 Nov 2025 13:32:36
సమానత్వం, శాంతి, సేవ ఆయన సందేశం.... జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు.... మెదక్ నవంబర్ 23 (ప్రజా స్వరం) సత్య సాయి 100 వ జయంతి సందర్బంగా...


