మహిళా భవన నిర్మాణానికి భూమి పూజ...

మహిళా భవన నిర్మాణానికి భూమి పూజ...

మాసాయిపేట్, ఫిబ్రవరి 27 (ప్రజాస్వరం):

 

మండలంలోని పోతన్ శెట్టిపల్లిలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రూ.10 లక్షల నిధులతో మహిళా భవన నిర్మాణానికి సర్పంచ్ ప్రశాంత్ భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పాలకవర్గం సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాపల్లి భాగ్యలక్ష్మి, బక్క స్వామి, గ్రామస్థులు నాగేందర్ రెడ్డి, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.