సీఎం ను కలిసిన నీలం మధు
పటాన్ చెరు (ప్రజా స్వరం) :
సీఎం రేవంత్ రెడ్డికి నీలం మధు నూతన సంవత్సర శుభాకాంక్షలు
2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి
మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ నీలం మధు ముదిరాజ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
గురువారం హైదరాబాద్లోని సెక్రటేరియట్లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి
పుష్పగుచ్ఛం అందజేసి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు.
ఈ సందర్భంగా పటాన్చెరు ప్రాంతంలో
రెండు జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయాలు,
రెండు నూతన పోలీస్ స్టేషన్ల మంజూరుకు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నీలం మధు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే రాబోయే రోజుల్లో డివిజన్ల అభివృద్ధికి,
నూతన మున్సిపాలిటీలకు తగిన నిధులు మంజూరు చేయాలని సీఎంను విజ్ఞప్తి చేశారు.
మెదక్ పార్లమెంట్ పరిధిలో జరగనున్న మున్సిపల్, స్థానిక సంస్థలు, జిహెచ్ఎంసి ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేలా కష్టపడి పని చేయాలని
నీలం మధుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
దీనికి స్పందించిన నీలం మధు,
మెదక్ పార్లమెంట్ పరిధిలో అత్యధిక స్థానాలు గెలిచే విధంగా
అందరం కలిసి కట్టుగా కృషి చేస్తామని సీఎంకు హామీ ఇచ్చారు.


