తెలంగాణ రక్షణ సేనలో భారీగా చేరికలు...
By Prajaswaram
On
మేడ్చల్ , ఆగస్టు 27 (ప్రజాస్వరం) :
మేడ్చల్ డివిజన్ పరిధిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి గుర్రం వెంకట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో పార్టీ అధినేత్రి కవిత వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండమీది నవీన్ కుమార్ ముదిరాజ్, తుడుం ప్రేమ సాగర్, కోటగిరి నాగరాజ్, రవికుమార్, కుమార్, నర్సింగ్, చాంద్ పాషా, భుజంగారావు, గిరిబాబు, అశోక్, అంకిత, నాగరాజు, శంకర్, ప్రభుదేవ్ తదితరులు భారీ సంఖ్యలో తెలంగాణ రక్షణ సేనలో చేరారు.ఈ చేరికలతో మేడ్చల్ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేనకు మరింత బలం చేకూరిందని నాయకులు తెలిపారు.
Latest News
27 Aug 2026 19:28:10
మేడ్చల్, ఆగస్టు 27 (ప్రజాస్వరం) : ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని రాజబొల్లారం గ్రామానికి చెందిన గుమ్మడిదల పద్మ రెండో కుమార్తె లత (21) అనారోగ్యంతో మృతి


