యూరియా కోసం జాతీయ రహదారి 44 పై రైతుల ధర్నా....
By Prajaswaram
On
వెల్దుర్తి ,(ప్రజాస్వరం) :
అవసరమైన సమయంలో పంటకు యూరియా అందకపోవడంతో నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని మెదక్ జిల్లా మాసాయిపేట 44వ జాతీయ రహదారిపై రైతులు రాస్తా రోకో నిర్వహించారు దీంతో ఐదు కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అనంతరం రైతులు మాట్లాడుతూ కొత్త యాప్ ద్వారా క్షణాలలోని యూరియా బుక్ కావడంతో తమకు అందడం లేదని వాపోయారు యాప్ విధానాన్ని తొలగించి గతంలో మాదిరిగా దుకాణం ద్వారా యూరియా వీక్రయించాలని డిమాండ్ చేశారు. మాసాయిపేటలో సహకార సంఘానికి 550 బస్తాల యూరియా త్వరగా ఇతర మండలాల నుంచి అప్ ద్వారా బుక్ చేసుకున్న వారికి ఇవ్వడం జరుగుతుందని మండిపడ్డారు దీంతో రైతుల వద్దకు చేరుకున్న చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి రైతులను సముదాయించి రాస్తారోకోను విరమింప చేశారు.
Latest News
27 Aug 2026 19:28:10
మేడ్చల్, ఆగస్టు 27 (ప్రజాస్వరం) : ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని రాజబొల్లారం గ్రామానికి చెందిన గుమ్మడిదల పద్మ రెండో కుమార్తె లత (21) అనారోగ్యంతో మృతి


