విద్యుత్ షాక్ తో యువకుడు మృతి...
By Prajaswaram
On
మెదక్ ,ఆగస్టు 27 (ప్రజాస్వరం) :
రాఖీ పండుగ సందర్భంగా దుకాణం ఏర్పాటు చేసిన ఓ యువకుడు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందిన ఘటన మెదక్ పట్టణంలో వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ పట్టణం జెఎన్ రోడ్డు లోని పొట్టి శ్రీరాములు విగ్రహం సమీపంలో రాఖీ దుకాణం ఏర్పాటు చేశారు. బుధవారం విద్యుత్ స్తంభం నుంచి సర్వీస్ వైర్ కిందకు పడటంతో షార్ట్ సర్క్యూట్ జరిగి దుకాణం వద్ద ఉన్న పట్టణానికి చెందిన సుభాష్ నగర్ కాలనీ కి కొత్తల నరేష్ (19) విద్యుత్ షాక్ కు గురయ్యాడు. వెంటనే అతడిని మెదక్ లోని ఓ ప్రవేట్ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.
Latest News
27 Aug 2026 19:28:10
మేడ్చల్, ఆగస్టు 27 (ప్రజాస్వరం) : ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని రాజబొల్లారం గ్రామానికి చెందిన గుమ్మడిదల పద్మ రెండో కుమార్తె లత (21) అనారోగ్యంతో మృతి


