మెదక్ లో సీఎం రేవంత్ దిష్టి బొమ్మ దహనం

మెదక్ లో సీఎం రేవంత్ దిష్టి బొమ్మ దహనం

ఫీజు రీయింబర్స్మెంట్ 1500 కోట్లు విడుదల చేయాలి....

రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేవైఎం నాయకులు....

మెదక్ ఆగస్టు 27 (ప్రజాస్వరం)


ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేవైఎం నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేశం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్లు పెండింగ్లో ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారన్నారు. యాజమాన్యాల సర్టిఫికెట్లను తీసుకోలేని పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెండింగ్లో ఉన్న 1500 కోట్ల రూపాయలు వెంటనే వీడియోలు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారి డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే బిజెపి, బీజేవైఎం ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, రాజు యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు బాబ్లు, బిజెపి బీజేవైఎం నాయకులు సన్నీ, సాయి, సాయి బాబా, ప్రవీణ్, నర్సింగ్, నవీన్, సాయి జగదీష్ సాయి కిరణ్, తదితరులు పాల్గొన్నారు

Latest News

గొప్ప మనసు చాటుకున్న రాజబొల్లారం గ్రామ ప్రజలు... గొప్ప మనసు చాటుకున్న రాజబొల్లారం గ్రామ ప్రజలు...
  మేడ్చల్, ఆగస్టు 27 (ప్రజాస్వరం) : ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని రాజబొల్లారం గ్రామానికి చెందిన గుమ్మడిదల పద్మ రెండో కుమార్తె లత (21) అనారోగ్యంతో మృతి
తెలంగాణ రక్షణ సేనలో భారీగా చేరికలు...
యూరియా కోసం జాతీయ రహదారి 44 పై రైతుల ధర్నా....
నో మ్యాపింగ్, లాజికల్ డిస్క్రెపెన్సీలను సరిచేసుకోవాలి....
విద్యుత్ షాక్‌ తో యువకుడు మృతి...
మెదక్ లో సీఎం రేవంత్ దిష్టి బొమ్మ దహనం
రైతులకు అవసరమైనంత యూరియ అందుబాటులో ఉంచాలి