ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు....
By Prajaswaram
On
ప్రజాస్వరం : మెదక్, మే 12 :
హనుమాన్ జయంతి సందర్భంగా మెదక్ పట్టణం జమ్మికుంట కాలనీ లోని స్థానిక హనుమాన్ ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని సుందరంగా అలంకరించి, శాస్త్రోక్తంగా అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.
Latest News
13 May 2026 12:24:36
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. లారీలు పంపాలని రైతుల డిమాండ్... ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 13 : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా చేగుంట మండలం...


