పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులకు భూభారతితో పరిష్కారం : జిల్లా కలెక్టర్ మను చౌదరి
పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులకు భూభారతితో పరిష్కారం : జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి
సిద్దిపేట / గజ్వేల్, ఏప్రిల్ 28 (ప్రజాస్వరం ) :
భూ సమస్యలు ఎదుర్కున్న విషయాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మేధావులు, ప్రజలు, ఇతలరులందరితో చర్చించి సలహాలు, సూచనలు స్వీకరించి 14 ఏప్రిల్ 2025 నాడు ఈ భూ భారతి చట్టం అమలులోకి తెచ్చింది అని దీంతో పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులకు భూ భారతి తో పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి అన్నారు. గజ్వేల్ పట్టణంలోని ఐఓసి లోని మీటింగ్ హల్ లో సోమవారం గజ్వేల్ మండల రైతులు, ప్రజా ప్రతినిధులతో భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.ముందుగా భూ భారతి చట్టం లోని వివిధ అంశాలను జిల్లా అదనపు కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. భూ సమస్యలు ఎదుర్కున్న విషయాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మేధావులు, ప్రజలు, ఇతలరులందరితో చర్చించి సలహాలు, సూచనలు స్వీకరించి 14 ఏప్రిల్ 2025 నాడు ఈ భూ భారతి చట్టం అమలులోకి తెచ్చింది అని అన్నారు.
పెండింగ్ లో ఉన్న సాదా బైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు.
రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని, దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చని అన్నారు. భూ భారతి చట్టం పై అవగాహన కల్పించేలా కర పత్రాలను పంపిణీ చేశామని, ప్రజలు వీటిని గమనించాలని ఏమైనా సందేహాలు ఉంటే తీర్చడానికి అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు. భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్ల పై భూ భారతి చట్టం ప్రకారం ఆప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయం పై కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయం పై భూమి ట్రిబ్యునల్ వద్ద అపీల్ చేసుకోవచ్చని, గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని, నేడు ఆ అవసరం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించిందని అన్నారు. అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పు తర్వాత కూడా సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టు వెళ్ళవచ్చని, దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డుల తయారు చేసి, ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డు డిస్ ప్లే చేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో చంద్రకళ, మండల ప్రత్యేక అధికారీ సువర్ణ, తహసిల్దార్, రైతులు, వివిధ వర్గాల ప్రజలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.