వివాహాతర సంబంధమే హత్య కు కారణం...

డిఎస్పీ నరేందర్ గౌడ్ ....

వివాహాతర సంబంధమే హత్య కు కారణం...

ప్రజాస్వరం : తూప్రాన్ ,మే14 : 

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

మెదక్ జిల్లాలో శభాష్ పల్లి శివారులో హత్య చేసి రోడ్డు ప్రక్కన గుర్తుతెలియని శవం జిల్లాలో కలకలం రేపింది. మెదక్ జిల్లా శివంపేట మండలం జగ్గయ్య తాండ పరిధిలోని బంజారా తాండకు చెందిన కోలా లలితఅనే మహిళ తో అన్వర్ హత్య వివాహేతర సంబంధమే కారణం అని తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు అక్రమ సంబంధం పెట్టుకున్న ట్రాక్టర్ డ్రైవర్ అన్వర్ బంజారు తాండ లలిత ఇంటికి వెళ్లడంతో గమనించిన లలిత తమ్ముడు కోలా రాజు బంధువైన దుర్గయ్యతో కలసి లలిత ఇంటివద్ద కర్రలతో దాడి చేయగా ఊపిరిఆడటం లేదని అన్వర్ చనిపోయాడని రాజు స్నేహితులు సహకారం తో మండలంలోని శభాష్ పల్లి శివారులో రోడ్డు ప్రక్కన శవం పడేసి వెళ్లారు గుర్తుతెలియని శవం ఉన్నదని పోలీస్ లకు సమాచారం రావడంతో తూప్రాన్ సిఐ వెంకట రాజా గౌడ్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు లో వేగవంతం చేసి హత్య గల కారణాలు ఎక్కడ హత్య జరిగింది పూర్తి విచారణ చేపట్టారు అన్వర్ కు వివాహేతర సంబంధం ఉన్నా ఆధారాలు సేకరించి హత్య లో పాల్గొన సహకరించిన కోలా రాజు, దుర్గ, లలిత, రమేష్, శ్రీశైలం ,అశోక్ అనే ఆరు గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ మీడియా సమావేశం లో వెల్లడించారు హత్య కు వాడినా కర్రలు మూడు సెల్ ఫోన్లు కారు బైక్ ట్రాక్టర్ ను సిజ్ చేసినట్లు డిఎస్పీ తెలిపారు. ఈ సమావేశం లో తూప్రాన్ సిఐ వెంకట రాజా గౌడ్, శివ్వం పేట్ ఎసై మధుకర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.