వరద ఉదృతితో ఏడుపాయల ఆలయం ముసివేత

వరద ఉదృతితో ఏడుపాయల ఆలయం ముసివేత

ఏడుపాయల ఆలయం మూసివేత..
రాజగోపురం ఉత్సవ విగ్రహానికి పూజలు.
 
మెదక్ ఆగస్టు 14 (ప్రజా స్వరం)

వన దుర్గా ప్రాజెక్టు మంజీరా నదీ పొంగిపొర్లుతున్నడడంతో ఏడుపాయల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం నాగసాన్ పల్లి గ్రామంలోని ఏడుపాయల వన దుర్గా మాత ఆలయం జలదిగ్బంధంలో మారింది. సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని అధికారులు వదలడంతో వన దుర్గామాత ఆలయ సమీపంలో ఆనకట్ట పూర్తిగా నిండి పొంగిపొర్లుతోంది. ప్రాజెక్టు పై నుంచి గంగమ్మ పరవళ్ళు తొక్కుతూ వన దుర్గామాత ప్రధాన ఆలయం ముందున్న నదీ పాయ ఉధృతంగా ప్రవహిస్తుంది. ముందు జాగ్రత్తగా గురువారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు, అధికారులు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఏర్పాటు చేసి భక్తులకు వన దుర్గమ్మ దర్శనం కల్పిస్తున్నారు. వరద ఉధృతి తగ్గు ముఖం పట్ట గానే మూలవిరాట్ అమ్మవారి దర్శనం యధావిధిగా కొనసాగుతుందని ఆలయ ఈవో చంద్రశేఖర్ పేర్కొన్నారు

Latest News

నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ....
జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి ప్రతిభ....నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... మెదక్ ఆగస్టు 30 (ప్రజా స్వరం) జాతీయ స్థాయి కరాటే...
సమయపాలని పాటించని ఉద్యోగులపై మెదక్ కలెక్టర్ కొరడా 
పగడ్బందీగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు : మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
బీజేపీలో భారీగా చేరికలు  
ప్రభుత్వ సహాయక చర్యలు అంతంత మాత్రమే : ఎంపీ రఘునందన్ రావు....
సహాయక చర్యల్లో జిల్లా పాలన యంత్రాంగం తీరు అభినందనీయం : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
బీజేపీ జిల్లా నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రం అందజేత..