నిలోఫర్ లో వైద్యల నిరసన....
ప్రజాస్వరం : హైదరాబాద్ : జూన్ 08 :
నిలోఫర్ ఆస్పత్రిలో పీజీ వైద్యుడిపై రోగి సహాయకుడి దాడి చేయడాన్ని నిరసిస్తూ, పీజీ వైద్యులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. మూడు రోజులక్రితం డాక్టర్స్ పై దాడి జరిగినా అధికారులు, పోలీసులు పట్టించుకోలేదని వారన్నారు. పిజి విద్య విద్యార్థులపై రోగి సహాయకులు దాడి చేయడాని నిరసిస్తూ...దాడి చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బాలికను ఆసుపత్రికి తీసుకొచ్చారు. వచ్చిన మొదటి రోజునుండి బాలిక తాలూకు కుటుంబసభ్యులు ఐసీయూలో పదుల సంఖ్యలో వచ్చి తీవ్ర ఇబ్బందులు పెట్టారు. శని వారం అర్ధరాత్రి రోగి సహాయకుడు ఐసీయూలోకి వచ్చి వాగ్వాదం చేసి డాక్టర్ పై రోగి సహాయకుడు దాడికి దిగారు. వెంటనే స్పీఎఫ్ పోలీసులకు పిర్యాదు చేసారని అన్నారు.ఎస్పిఎఫ్ పోలీసులు డాక్టర్స్ కు కాకుండా దాడికి పాల్పడిన వారికే మద్దత్తు పలకడానికి పిజి వైద్యులు తీవ్రంగా ఖండించారు నాంపల్లి పోలీసులకు పిర్యాదు చేసిన ...అప్పటికి పోలీసులు పట్టించుకోకపోవడం తో పిజి వైద్యులు వీధులు బహిష్కరించి ఆందోళ చేపట్టారు.
==================


