18,000 మంది ఉద్యోగులను తొలగిస్తాం.. ఇంటెల్ కంపెనీ సంచలన ప్రకటన

అమెరికా చిప్‌ల తయారీ దిగ్గజం ఇంటెల్ కంపెనీ సంచలన ప్రకటన చేసింది. కంపెనీ కార్యకలాపాల క్రమబద్ధీకరణలో భాగంగా 15 శాతానికి పైగా మంది ఉద్యోగులను తగ్గించుకోబోతున్నట్టు గురువారం వెల్లడించింది. ఇటీవల ముగిసిన త్రైమాసికంలో కంపెనీ సుమారు 1.6 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిన నేపథ్యంలో ఈ ఏడాది వ్యయాలను సుమారు 20 బిలియన్ డాలర్ల మేర కుదించుకునేలా ప్రణాళికలు రూపొందించుకున్నామని తెలిపింది. ముఖ్యమైన ఉత్పత్తి, ప్రాసెస్ టెక్నాలజీ పరంగా లక్ష్యాలను చేరుకున్నప్పటికీ రెండవ త్రైమాసికంలో కంపెనీ ఆర్థిక పనితీరు నిరాశాజనకంగా ఉందని ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాట్ గెల్సింగర్ తెలిపారు. ఆర్థిక సంవత్సరం రెండవ అర్ధభాగంలో పరిస్థితులు మరింత సవాళ్లతో కూడి ఉంటాయని భావిస్తున్నట్టు చెప్పారు.

కాగా ఇంటెల్ కంపెనీలో గత ఏడాది చివరి నాటికి 124,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 15 శాతం మందిని తొలగిస్తే దాదాపు 18,000 మందిపై ప్రభావం పడొచ్చని అంచనాగా ఉంది. ప్రత్యర్థులు ఎన్వీడియా, ఎఎమ్‌డి మరియు క్వాల్‌కామ్‌ల నుండి బలమైన సవాళ్లను ఎదుర్కొంటూ ఇంటెల్ ధిక్కరించిన ఒక నెల తర్వాత బెల్ట్-బిగింపు వచ్చింది, కృత్రిమ మేధస్సు విప్లవానికి దారితీస్తుందని సాంకేతికతలను ఆవిష్కరించింది.

ఇంటెల్‌కు గట్టి పోటీ!
కొన్ని దశాబ్దాలపాటు ల్యాప్‌టాప్‌ల నుంచి డేటా సెంటర్‌ల వరకు ఇంటెల్ చిప్‌ల ఆధిపత్యం చెలాయించింది. అయితే ఈ మధ్యకాలంలో ఆ కంపెనీకి పోటీ పెరిగిపోయింది. ఎన్వీడియా, ఏఎమ్‌డీ, క్వాల్‌కామ్‌ల నుంచి ఆ కంపెనీకి గట్టి పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా ఏఐ ప్రాసెసర్‌ల మీద ప్రత్యేక దృష్టిసారించిన ఎన్వీడియా నుంచి ఇంటెల్ కంపెనీకి మార్కెట్‌లో పోటీ ఎదురవుతోంది.images

Related Posts

Latest News

ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం పరిశీలిస్తాం..... ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం పరిశీలిస్తాం.....
సమస్యల పరిష్కారం త్వరితగతిన పూర్తి..... ప్రజావాణిలో వినతులు స్వీకరించిన మెదక్ జిల్లా ఎస్పీ...     ప్రజాస్వరం: మెదక్, మే 18  :      మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం...
రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు....
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి.... 
మేడ్చల్ లో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి...
ఆరోగ్య కేంద్రంలో వరల్డ్ హైపర్ టెన్షన్ డే.... 
ఎంసెట్ ఫలితాల్లో త్రివిద్య కళాశాల విద్యార్థుల ప్రభంజనం....
సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.....