ఉగ్రవాదుల భరతం పడుతున్న భారత్

ఉగ్రవాదుల భరతం పడుతున్న భారత్

ఢిల్లీ . 
ఎప్పటి నుంచో అనుకుంటున్న ప్రజలంతా కోరుకుంటున్న గడియలు రానే వచ్చాయి. భారత సైన్యం  పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోకి భారత సైన్యం ఇప్పటికే  ఎంట్రీ ఇచ్చినట్టు సమాచారం.   దీనిపై ఇంత వరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ భారత్ సైన్యం మాత్రం ఆ ప్రాంతంలోకి వెళ్లి ఉగ్రవాదుల భరతం పట్టే పనిలో ఉందని తెలుస్తోంది.మరోవైపు భారత్ చేస్తున్న దాడులకు పాకిస్థాన్ వణికిపోతోంది. చైనా ఇచ్చిన పేలని బాంబులతో యుద్ధం చేస్తున్నట్టు ఆ దేశ ప్రజలకు కలరింగ్ ఇస్తోంది. ఆ దేశ మీడియాలో హైక్ క్రియేట్ చేస్తోంది. భారత్‌ను కవ్వించి తప్పు చేసిన పాకిస్థాన్ దానికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తోంది. ఆ దేశా రాజధాని ఇస్లామాబాద్ ను భారత ఆర్మీ డ్రోన్‌లు ధ్వంసం చేశాయి. పాక్ ప్రధాని అధికారిక భవనం పక్కనే బాంబు వర్షం కురిపించింది భారత్. భారత్ దూకుడు చూసిన పాకిస్థాన్ ప్రధాన మంత్రి బిచాణా సర్దేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు బంకర్లలో దాక్కున్న షాబాజ్ షరీఫ్  ఇప్పుడు విదేశాలకు పారిపోయేందుకు స్కెచ్ వేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఆ దేశ సైన్యాధ్యక్షుడు ఫ్యామిలీతో విదేశాలకు పారిపోయారని తెలుస్తుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడితో పరిస్థితి మరింత మారిపోయింది. దీనికి స్పందించిన భారత్ ఆపరేషన్ సిందూర్ ఎంపిక చేసిన ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్టు ప్రకటించారు. ఇది జరిగిన కొన్ని గంటలకు పొరుగు దేశం నుంచి డ్రోన్ దాడుల జరిగాయి. దీనిపై సరిహద్దు రాష్ట్రాల నుంచి నివేదికలతో పరిస్థితులు వేగంగా మారిపోయాయి.మే 7-8 తేదీల్లో ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని 15 ప్రదేశాల్లో ఇలాంటి బెదిరింపులను అడ్డుకున్న తర్వాత, జమ్మూ, పఠాన్‌కోట్‌లలోని డ్రోన్‌లు, క్షిపణులతో సైనిక స్థావరాలపై దాడి చేయడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలను భారతదేశం విజయవంతంగా తిప్పికొట్టింది. గురువారం సాయంత్రం మళ్లీ అలాంటి కుటింల యత్నానికి పాల్పడింది. నియంత్రణ రేఖ (LOC), జమ్మూ, కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తాన్ దళాలు కాల్పులకు తెగపడ్డాయి. ఉదయం పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థలను భారతదేశం లక్ష్యంగా చేసుకుంది. వాటిని న్యూట్రలైజ్ చేసింది.  ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రధాన కార్యాలయం, జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లోని సైనిక స్థావరాలను పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్‌లను ఉపయోగించి లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడులను సమర్థంగా తిప్పికొట్టామని ఎలాంటి నష్టం వాటిల్లలేదని  ప్రకటించింది.  జమ్మూలోని కీలక ప్రదేశాల వైపు పాకిస్తాన్ ప్రయోగించిన కనీసం ఎనిమిది క్షిపణులను భారత వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. టార్గెట్ చేసిన లక్ష్యాల్లో వ్యూహాత్మకంగా ముఖ్యమైన జమ్మూ సత్వారీ విమానాశ్రయం, సాంబా, RS పురా, ఆర్నియా ఉన్నాయి.కాస్త విరామం తర్వాత జమ్మూలో రెండు పెద్ద పేలుళ్లు వినిపించాయి. ఆ తర్వాత నగరం అకస్మాత్తుగా బ్లాక్‌అవుట్‌ అయింది. డ్రోన్‌లను గాలిలో అడ్డగించడం వల్ల పేలుళ్లు జరిగి ఉండొచ్చు. భద్రతా సంస్థలు హై అలర్ట్‌లో ఉన్నందున ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సైరన్‌లు వెంటనే అప్రమత్తం చేశాయి.పేలుళ్లు, పదేపదే సైరన్‌ల నివేదికల తర్వాత రాజస్థాన్‌లోని సరిహద్దు జిల్లాలు రెడ్ అలర్ట్ జారీ చేసి అనేక ప్రాంతాలలో బ్లాక్‌అవుట్‌లను అమలు చేశాయి.జైసల్మేర్‌లో దాదాపు గంటసేపు భారీ పేలుడు సంభవించి, అడపాదడపా పేలుళ్లు జరిగాయి. జిల్లా అంధకారంలో ఉంది. బాడ్మేడ్‌ రైల్వే స్టేషన్, ప్రధాన మార్కెట్, జిల్లా కలెక్టరేట్‌తో సహా కీలక ప్రదేశాల్లో ఐదు వేర్వేరు సమయాల్లో సైరన్‌లు మోగాయి.శ్రీగంగానగర్‌లో అధికారులు ప్రజలు ఇంటి లోపలే ఉండి లైట్లు ఆపివేయాలని కోరారు. పెరుగుతున్న ప్రజా ఆందోళన కారణంగా పోలీసులు పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు.బికనీర్‌లో పూర్తి బ్లాక్‌అవుట్‌ను అమలు చేశారు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఆంక్షలు కొనసాగుతాయని జిల్లా మేజిస్ట్రేట్ నమ్రతా వృష్ణి ఆదేశాలు జారీ చేశారు. జోధ్‌పూర్‌లో, జిల్లా మేజిస్ట్రేట్ గౌరవ్ అగర్వాల్ తక్షణం పాటించాలని ఇదే విధమైన ఆదేశాన్ని జారీ చేశారు.జైసల్మేర్ నగరంలో కూడా పేలుడు శబ్దాలు, సైరన్‌లు వినిపించాయి. అవి జైసల్మేర్-పోఖ్రాన్ ప్రాంతంలో డ్రోన్ కార్యకలాపాలకు సంబంధించినవని తెలుస్తోంది.  సరిహద్దుల్లో పాకిస్తాన్ చేసిన డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా భారతదేశం లాహోర్‌పై డ్రోన్ దాడిని ప్రారంభించింది. ఈ దాడి తర్వాత, ఇస్లామాబాద్, కరాచీ, బహవల్‌పూర్‌తో సహా అనేక పాకిస్తాన్ నగరాల్లో సైరన్‌లు మోగాయని నివేదికలు వస్తున్నాయి. ఇది ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. పాకిస్తాన్ వైమానిక దళం వైమానిక హెచ్చరిక, నియంత్రణ వ్యవస్థ) విమానాన్ని భారత్ కూల్చివేసిన తర్వాత ఈ పరిణామం జరిగింది.ఉగ్రదాడుల నేపథ్యంలో కరాచీ ఓడరేవు ప్రాంతం సమీపంలో పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. దీంతో భారత నావికాదళం అలర్ట్ అయింది. అరేబియా సముద్రంలో కీలకమైన అస్త్రాలను రెడీ చేసింది. కార్యాచరణ సంసిద్ధతను కొనసాగించడానికి పశ్చిమ నావికాదళం INS విక్రాంత్, డిస్ట్రాయర్లను మోహరించిందని తెలుస్తోంది. భారతదేశ క్షిపణి రక్షణ వ్యవస్థలు పాకిస్తాన్‌కు చెందిన ఒక F-16, రెండు JF-17 యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు. అంతకుముందు, 15 భారతీయ నగరాలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం విఫలమైన కొన్ని గంటల తర్వాత పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాలపై దాడి చేసింది. రాత్రి 9 గంటలకు కొద్దిసేపటి ముందు, జమ్మూలో పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అప్పుడు, సైరన్లు మోగడం ప్రారంభించాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ కాలంలోని అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పరిస్థితి మరింత దిగజారడంతో, నగరంలోని అనేక ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ సేవలు నిలిచిపోయాయి. దీంతో స్థానికులు తమ స్నేహితులు, బంధువులను సంప్రదించడానికి ప్రయత్నించారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలలో ఎక్కువ భాగం ఇప్పుడు అంధకారంలో ఉన్నాయి. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, గురుదాస్‌పూర్‌లలో పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న మరొక రాష్ట్రమైన రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో కూడా బ్లాక్‌అవుట్ ప్రకటించారు.

Latest News