వినేశ్‌ ఫొగాట్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌..- కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్‌ ఫోగట్‌

వినేశ్‌ ఫొగాట్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌..- కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్‌ ఫోగట్‌

వినేశ్‌ ఫొగాట్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌.. 
- ఢిల్లీ ఎయిర్‌పోర్ట్​‌కు భారీగా చేరుకున్న అభిమానులు  
- కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్‌ ఫోగట్‌
ప్రజా స్వరం, నేషనల్ ​బ్యూరో : భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ పారిస్‌ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. శనివారం ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యారు. ఈ సందర్భంగా రెజ్లర్‌ వినేశ్ ఫొగాట్‌కు గ్రాండ్ వెల్‌కమ్ స్వాగతం లభించింది. పారిస్‌లో జరిగిన  ఒలింపిక్స్‌ క్రీడల్లో వినేశ్‌పై అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. 50 కిలోల  విభాగంలో వంద  గ్రాములు అధిక బరువు ఉందన్న కారణంగా ఫైనల్‌కు కొన్ని క్షణాల ముందు రెజ్లర్‌పై అనర్హత వేటు పడింది. దీంతో యావత్​ భారత దేశం తీవ్ర నిరాశ చెందింది. ఇక తన ‘అనర్హత వేటు’పై కోర్టు ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌(కాస్‌)ను వినేశ్‌ ఆశ్రయించగా, అక్కడా నిరాశే ఎదురైంది. ఈ నెల 16న తీర్పు వెలువరించాల్సి ఉన్నా 14వ తేదీ రాత్రి ఉన్నఫళంగా ఆమె పిటిషన్‌ను కొట్టేస్తున్నట్టు ప్రకటించడం భారత క్రీడాభిమానులను నివ్వెరపోయేలా చేసింది. కారణాలేమీ చెప్పకుండానే ‘సింగిల్‌ లైన్‌ ఆర్డర్‌’తో కాస్‌ వెలువరించిన ప్రకటన అనంతరం ఆమెకు పలువురు క్రీడాకారులు మద్దతుగా నిలిచారు. ఈ పరిణామాల అనంతరం వినేశ్‌ తొలిసారి భారత్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు మద్దతుగా పెద్దఎత్తున అభిమానులు ఎయిర్‌పోర్ట్‌ వద్దకు వెళ్లారు. వారిని చూసిన వినేశ్‌ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. 
download (5)

Latest News

ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం పరిశీలిస్తాం..... ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం పరిశీలిస్తాం.....
సమస్యల పరిష్కారం త్వరితగతిన పూర్తి..... ప్రజావాణిలో వినతులు స్వీకరించిన మెదక్ జిల్లా ఎస్పీ...     ప్రజాస్వరం: మెదక్, మే 18  :      మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం...
రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు....
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి.... 
మేడ్చల్ లో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి...
ఆరోగ్య కేంద్రంలో వరల్డ్ హైపర్ టెన్షన్ డే.... 
ఎంసెట్ ఫలితాల్లో త్రివిద్య కళాశాల విద్యార్థుల ప్రభంజనం....
సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.....